బిజెపి లో చేరిన పావులూరి వెంకట్, నూకల శివ
అమలాపురం : బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు అన్నారు. దొరబాబు మాట్లా డుతూ దేశంలో అవినీతిరహితపాలన ప్రధాని మోదీతోనే సాధ్యమన్నారు. అమలాపురం కు చెందిన యువ నాయకులు నూకల శివ, పావులూరి వెంకట్ కాంగ్రేసు పార్టీ కి రాజీనామా చేసి. అమలాపురం పార్లమెంట్ బిజెపి అధ్యక్షులు యాళ్ల దొరబాబు సమక్షంలో బిజెపి పార్టీ లో చేరారు .నూకల శివ కాంగ్రెస్ పార్టీకి అమలాపురం టౌన్ అధ్యక్షులుగా గతంలో పనిచేశారు . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు బిజెపి సీనియర్ నాయకులు ఆర్వి నాయుడు పార్లమెంట్ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి వెంకటేశ్వరరావు సీక్రిమిల్లి శ్రీనివాసరావు పాలూరి జయప్రకాష్ బొంతు శివాజీ ఎన్ శ్రీరామ్ పాల్గొన్నారు ..
What's Your Reaction?