అయినవిల్లి ఈవో సత్యనారాయణ రాజుని సస్పెండ్ చేయాలి! డివైఎఫ్ఐ
నిడదవోలు : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో అనర్హులకు ప్రమోషన్లు ఇవ్వడం మరియు అక్రమంగా ప్రమోషన్ పొందిన అయినవిల్లి ఈవో సత్యనారాయణ రాజుని సస్పెండ్ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర నాయకులు గారపాటి ప్రసన్న కృష్ణ డిమాండ్ చేశారు ...
.దేవాదయ ధర్మదాయ శాఖలో అక్రమ ప్రమోషన్ ల వ్యవహారం పై నిజా నిజాలు బయట పెట్టాలన్నారు. సీనియారిటీ లిస్టు ఖాతర్ చేయకుండా జీ వో. 888 ను అమలు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ప్రమోషన్ ఇవ్వడాన్ని డివైఎఫ్ఐ ఖండిస్తుంది అర్ధరాత్రి ప్రమోషన్లపై సమగ్ర విచారణ జరపాలని అంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న అయినవల్లి ఈవో సత్యనారాయణ సస్పెండ్ చేయాలన్నారు . హైకోర్టు స్వయంగా సత్యనారాయణ రాజు ప్రమోషన్ అక్రమాన్ని తేల్చిన తర్వాత కొనసాగించడం సరికాదన్నారు. సత్యనారాయణ రాజు విచారిస్తే అక్రమ ప్రమోషన్ల విషయంలో వెనకాల ఉన్న పెద్ద తలకాయల పేర్లు బయటికి వస్తాయన్నారు .దీనికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేట్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .అక్రమ ప్రమోషన్ల వ్యవహారంలో సీనియారిటీ ఉన్న ఉద్యోగులు ,దశాబ్ద కాలంగా పనిచేస్తున్న చిన్న ఉద్యోగులకు నష్టం కలుగుతుందని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అర్హులు లకు న్యాయం చేయాలన్నారు...
What's Your Reaction?