వచ్చే ఎన్నికల్లో కన్నబాబు విజయం తధ్యం ! జగన్ ముఖ్యమంత్రి ఖాయం !!
కన్నబాబుని భారి మెజార్టీ తో గెలిపించాలి ...రాష్ట్ర కాపునాడు కన్వీనర్ గిద్డా శ్రీనివాస నాయుడు పిలుపు
కాకినాడ రూరల్ లో వైసేపి అభ్యర్ది కురసాల కన్నబాబు విజయం తధ్యమని ,అలాగే రాష్ట్రంలో జగన్ రెండవ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని , . టిడిపి కూటమికి మరోసారి బంగపాటు తప్పదని రాష్ట్ర కాపునాడు కన్వీనర్ గిద్డా శ్రీనివాస నాయుడు జోష్యం చెప్పారు. అణుగారిన వర్గాలుగా ఉన్న బలహీన వర్గాలకు ఆర్థికంగా,సామాజికంగా, రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సమాజంలో వారికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన పార్టీ వైసీపి అని రాష్ట్ర కాపునాడు కన్వీనర్ గిద్డా శ్రీనివాస నాయుడు అన్నారు .
కాకినాడ రూరల్ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు ఉన్నత విద్యావంతుడు ,నిగర్వి ,పరిపాలన అనుభవం ఉన్న కురసాల కన్నబాబు బడుగు ,బలహీన వర్గాల ప్రజలకు అన్ని వేళ్ళల్లో సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్రంలోనే కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం గా తీర్చిదిద్దినారని ఆయన శ్రీనివాస నాయుడు కొనియాడారు .తన పరిపాలన అనుభవాన్ని రంగరించికొని నియోజకవర్గంలో వందలాది బిసి కమ్యూనిటి హాల్స్ ను ,అంబేద్కర్ విశ్రాంతి భవనాలను ,బాబు జగజ్జీవన్ రావు కమ్యూనిటి హాల్స్ మరియు బడుగు బలహీన వర్గాలకు కళ్యాణ మండపాలను ,విశ్రాంతి భవనాలను నిర్మించి ప్రజల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచారని ఆయన అన్నారు . కాకినాడ నియోజక వర్గంలో అన్ని గ్రామాల ప్రజలు కన్నబాబు సేవలు గుర్తించి కన్నబాబుని భారి మెజార్టీ తో గెలిపించాలని కాపునాడు పక్షాన గిద్డా శ్రీనివాస నాయుడు పిలుపు నిచ్చారు .
What's Your Reaction?