జై భారత్ నేషనల్ పార్టీ ముమ్మిడివరం అసెంబ్లీ అభ్యర్ధి “వనచర్ల బాబ్జి”
ముమ్మిడివరం : జై భారత్ నేషనల్ పార్టీ ముమ్మిడివరం అసెంబ్లీ అభ్యర్ధిగా వనచర్ల బాబ్జిని ఆ పార్టీ అధినేత జెడి లక్ష్మి నారాయణ ప్రకటించారు. సామాన్య నిరుపేద కుటుంబానికి చెందిన విద్యావంతుడు వనచర్ల బాబ్జిని ప్రకటించడం తో ముమ్మిడివరం అసెంబ్లీ స్థానం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ పోటిచేయడం ఖాయమైంది .నియోజకవర్గంలో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జై భారత్ నేషనల్ పార్టీ తరుపున పోటీలో ఉండడంతో ప్రధాన అధికార ,ప్రతి పక్ష పార్టీలలో చర్చానీయాసంగా మారింది. వనచర్ల బాబ్జి మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీకి ఎందుకు ఓటు వెయ్యాలి అని ప్రశ్నించుకుంటే.. అవినీతి రహిత సమాజం కోసం సామాన్యుడు ఓటు వేయాలని ఆయన అన్నారు. విధ్వంసం లేని, రౌడీయిజం లేని అ,ప్పు లేని ,తప్పు లేని మత్తు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని ,జెడి లక్ష్మి నారాయణ ఆశయాలు అనుగుణంగా పని చేస్తామని వనచర్ల బాబ్జి పేర్కొన్నారు . అంతే కాదు.....ప్రతీ గ్రామంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకొవాలని ,వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తెచ్చుకోవాలని ,సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఉచిత విద్యుత్ పొందేలా కృషి చేస్తామని అన్నారు .పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను తగ్గింపుతో వాటి ధరలు తగ్గించేలా పోరాటం చేస్తానని బాబ్జి తెలిపారు మెరుగైన ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం నిరంతరం పాటు పడతామని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో గుజరాత్ రాష్ట్రంతో పోటీ పడటానికి... కుల మతాలకు అతీతంగా ప్రజలంతా జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల గుర్తు బ్యాటరీ” టార్చ్ లైట్ ” పై మీ పవిత్రమైన ఓట్లు వేసి జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని వనచర్ల బాబ్జి మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసారు
What's Your Reaction?