ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీ .. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు

Apr 2, 2024 - 17:30
Apr 2, 2024 - 17:32
 0  5971
ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీ .. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు

రాష్ట్ర ఎన్నికల సంఘం  సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరుగురు ఐపీఎస్ , ముగ్గురు ఐఏఎస్‌  అధికారులను ముకుమ్మడిగా బదిలీ చేసింది.వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌  , పల్నాడు జిల్లాఎస్పీ రవిశంకర్‌ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డిని, చిత్తూరు ఎస్పీ జాషువా , గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజును బదిలీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాను బదిలీ చేసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow