ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ .. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు
రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరుగురు ఐపీఎస్ , ముగ్గురు ఐఏఎస్ అధికారులను ముకుమ్మడిగా బదిలీ చేసింది.వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ , పల్నాడు జిల్లాఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డిని, చిత్తూరు ఎస్పీ జాషువా , గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాను బదిలీ చేసింది.
What's Your Reaction?