పి.గన్నవరం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి సమష్టిగా కృషి చేసి పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ విజయపతాకం ఎగురవేయాలని రాష్ట్ర శెట్టి బలిజ యువత అధ్యక్షులు గుత్తుల శ్రీను అన్నారు.మండలంలోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ గారికి మద్దతు గా గుత్తుల శ్రీను పర్యటించి, తమ ముఖ్యనాయకులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తల కష్టం, శ్రమ, విలువ తెలిసిన వ్యక్తిని .. సమయాభావం వల్ల కొందర్నికలవకపోవచ్చు... పార్టీలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా.. మీలో ఒకడిగా సేవచేస్తా.. మమ్మల్నిమనస్ఫూర్తిగా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని" వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ అన్నారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తను అక్కున చేర్చుకుంటానన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తననుదరించాలని అభివృద్ధి అంటే ఏమిటో, ఎలా ఉంటుందో చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘం కార్యదర్శి పేచ్చెట్టి శ్రీను, ముక్కామల శెట్టిబలిజ సంఘం నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్వర రావు,గుబ్బల సత్యనారాయణ, రాయుడు శ్రీను , ముసిని గోవిందు మరియు రాష్ట్రా వైఎస్ఆర్సీపీ sc సెల్ నాయకుడు స్టాలిను బాబు, అంబాజిపేట వైఎస్ఆర్సీపీ మండల అద్యక్షుడు విత్తనాల శేకర్ తో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు.