టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాతృ వియోగం
టెక్కలి : టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి మాతృ వియోగం కలిగింది. శ్రీకాకుళం జిల్లా కోటబమ్మాళి మండలం నిమ్మాడలోని స్వగఅహంలో కళావతమ్మ(90) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో అనారోగ్యం బారిన పడ్డారు. ఆమెకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా.. పెద్ద కుమారుడు ఎర్రన్నాయుడు 12 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మఅతి చెందారు. భర్త దాలినాయుడు 15 ఏళ్ల క్రితం కన్నుమూశారు. రెండో కుమారుడు హరివరప్రసాద్ కోటబమ్మాళి పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడో కుమారుడు ప్రభాకర్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కళావతమ్మ మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తదితరులు సంతాపం తెలిపారు.
What's Your Reaction?