రాజ్యాంగాన్ని కాపాడుకోవ‌డ‌మే అంబేద్క‌ర్‌కి నిజ‌మైన నివాళి  ! -  సిఐటియు

Apr 15, 2024 - 06:44
 0  5007
రాజ్యాంగాన్ని కాపాడుకోవ‌డ‌మే అంబేద్క‌ర్‌కి నిజ‌మైన నివాళి  !   -  సిఐటియు

Peddapuram :       బిన్న మ‌తాలు, సంస్కృతులు, భాష‌లు, హ‌క్కులు, విధులు, రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ రాసుకున్న  భార‌త రాజ్యాంగాన్ని కాపాడుకోవ‌డమే డా. బి.ఆర్‌. అంబేద‌ర్క‌ర్‌కి మ‌నం ఇచ్చే నిజ‌మైన నివాళి అని సిఐటియు నాయ‌కులు అన్నారు. పెద్దాపురం ప‌ట్ట‌ణంలోని మున్సిప‌ల్ సెంట‌ర్‌లో డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ 133వ జ‌యంతి సంవ‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగాన్ని మ‌న‌కు మ‌నంగా స‌మ‌ర్పించుకున్న సంగ‌తి ఎప్ప‌టికి మ‌న‌కు గుర్తుఉండాల‌ని అన్నారు. అంబేద్క‌ర్ వ‌ర్ధంతి జ‌యంతుల‌కు దండ‌వేసి దండం పెడితే స‌రిపోద‌ని ఆయ‌న ఆశ‌యాల‌ను కాపాడ‌డం ద్వారా మాత్ర‌మే ఆయ‌నకు నిజ‌మైన నివాళి అన్నారు. కార్మిక హ‌క్కుల కోసం పోరాడ‌ర‌ని, ప‌ని గంట‌లు, మ‌హిళా హ‌క్కులు ఓటు హ‌క్కు అనేక అంశాల మీద అంబేద్క‌ర్ స్ప‌ష్ట‌మైన విధానం మ‌న‌ముందు ఉంచారని అన్నారు. కేంద్రంలో బిజెపి అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటూ ప్ర‌చారం ప్రారంభించిద‌ని అన్నారు. ద‌ళితులు, గిరిజ‌నులు హ‌క్కుల‌ను కాపాడుకుంటూ వ‌స్తున్న రాజ్యాంగాన్ని నాశ‌నం చేయ‌డం అంటే అణ‌గారిని వ‌ర్గాల మీద మ‌ర‌లా పెత్త‌నం చెయ్య‌డానికే అన్నారు. ఎన్నిక‌ల్లో రాజ్యాంగ వ్య‌తిరేకుల‌కు బుద్ది చెప్పాల‌ని అన్నారు. 
   కార్య‌క్ర‌మంలో సిఐటియు నాయ‌కులు గ‌డిగ‌ట్ల స‌త్తిబాబు, డి. క్రాంతికుమార్‌, నీల‌పాల సూరిబాబు, సిరిపుర‌పు శ్రీ‌నివాస్‌, ఎల‌క్ర్టిక‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ గౌర‌వాధ్య‌క్షులు చింత‌ల స‌త్య‌నారాయ‌ణ‌, పాండ‌వ‌గిరి పెయింటింగ్ యూనియ‌న్ నాయ‌కులు వ‌డ్డి స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌జానాట్య‌మండ‌లి నాయ‌కులు డి. కృష్ణ‌, ఆర్‌.వీర్రాజు, ఎమ్‌. రాంబాబు, సిరిపుర‌పు మ‌రిడియ్య‌, అంగ‌న్‌వాడీ యూనియ‌న్ నాయ‌కులు టి.ఎల్‌.ప‌ద్మ‌, సావిత్రి, లోవ‌దేవి, కె.అప్ప‌న్న‌, ఎన్‌.న‌ర‌సింహ‌మూర్తి, వివేక్‌, త‌దిత‌రులు పాల్గోన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow