సెల్ఫీ అడిగితే ఒక్కటిచ్చాడు.. అభిమాని చెంప చెల్లుమనిపించిన బాలకృష్ణ
హైదరాబాద్: సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అభిమానులపై చేయిచేసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో బాలయ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన హెలికాప్టర్లో కదిరికి చేరుకున్నారు. ఆయన ల్యాండ్ కాగానే అభిమానులు కొందరు బాలయ్య దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా.. సహనం కోల్పోయిన నటసిహం అతనిపై చేసుచేసుకున్నారు. అంతటితో ఆగకుండా అభిమానులపై ఆగ్రహం వ్యక్తంచేశారు
స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలకృష్ణ నేటి నుంచి రెండు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. కదిరి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ఆయన బస్సు యాత్రను ప్రారంభించారు.
What's Your Reaction?