సీఎం జగన్పైకి రాయి .. నుదిటి పై గాయం
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్లో ఈ ఘటన జరిగింది. బస్సుపై ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
ఇది చంద్రబాబు చేయించిన దాడి: వైసీపీ ఆరోపణ
విజయవాడలో సీఎం వైయస్ జగన్పై గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు’’ అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టింది.
What's Your Reaction?