వారాహి యాత్రలో ఉద్రిక్తత.. పవన్‌ కల్యాణ్‌పై రాయితో దాడి!

Apr 15, 2024 - 05:59
 0  13
వారాహి యాత్రలో ఉద్రిక్తత.. పవన్‌ కల్యాణ్‌పై రాయితో దాడి!

 ఏపీ సీఎం జగన్‌పై దాడి ఘటన మరవకముందే.. అలాంటిదే మరో ఘటన జరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కూడా ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. అదృష్టవశాత్తూ రాయి దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది.ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి యాత్ర ఆదివారం నాడు తెనాలికి చేరుకుంది. ఈ సందర్భంగా వారాహి విజయభేరి బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ యాత్ర కొనసాగుతుండగా.. ఓ దుండగుడు పవన్‌ కల్యాణ్‌పై రాయి విసిరారు. అయితే ఆ రాయి పవన్‌కు తగలకుండా సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జన సైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే పోలీసులు బందోబస్తు ఉండటంతో వారికి అప్పగించారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow