ఎంపీ మిథున్ రెడ్డిని రహస్యంగా కలిసిన జనసేన నేత శెట్టిబత్తుల రాజబాబు ..

Mar 19, 2024 - 16:07
 0  4296
ఎంపీ మిథున్ రెడ్డిని రహస్యంగా కలిసిన జనసేన నేత శెట్టిబత్తుల  రాజబాబు ..

వైసీపీ  ఎంపీ మిథున్ రెడ్డి ని అమలాపురం జనసేన ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు రహస్యంగా కలిసిన ఘటన ఏపీ లో సంచలనంగా మారింది. గత రాత్రి మిథున్ రెడ్డిని కలిసి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమలాపురం టిక్కెట్ టీడీపీకి కేటాయిస్తున్నారనే ప్రచారంతో జనసేనపై రాజబాబు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన కొన్ని రోజులుగా అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. జనసేన నాయకులకు ఎవరికీ తెలియకుండా రహస్యంగా మిథున్ రెడ్డిని శెట్టిబత్తుల  రాజబాబు కలిశారు. మిథున్ రెడ్డిని కలిశారనే ప్రచారంతో రాజబాబుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం టిక్కెట్ జనసేనకు కేటాయించాలని కొన్ని రోజులుగా అమలాపురంలో జనసేన నేతలు ఆందోళనలు చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow