జగన్ దుర్మార్గుడు..మోడీ అవసరం ఏపీకి ఉంది: చంద్రబాబు
బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. మోడీ అంటే ఆత్మగౌరవం అని, ఆత్మవిశ్వాసమని, ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు మోడీ అని చంద్రబాబు కొనియాడారు. భారత్ ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు నిర్విరామ కృషి చేస్తున్న గొప్ప నాయకుడు అని కొనియాడారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అని… మోడీ అంటేనే నమ్మకం అని చంద్రబాబు కితాబిచ్చారు.
100 దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీదే అని కరోనా సమయంలో దేశ ప్రజల ప్రాణాలను కాపాడింది ఆయనే అని గుర్తు చేశారు. మోడీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలని సరైన సమయంలో దేశానికి మోడీ వంటి నేత వచ్చారని చెప్పారు. ఇక దేశమంతా మోడీ పాలనలో దూసుకుపోతుందని, కానీ జగన్ పాలనలో రాష్ట్రం మాత్రం వెనుకబడిపోయిందని చంద్రబాబు విమర్శించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరం పని చేయాలని పిలుపునిచ్చారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ పేరుతో రాష్ట్రాన్ని దుర్మార్గుడు జగన్ దోచుకున్నాడని విమర్శించారు.
What's Your Reaction?