ఏపీలో జగన్కు భారీ షాక్.. కాంగ్రెస్లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే సీటు దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే నందికొట్కూర్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమంక్షలో ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల ప్రకటించిన వైఎస్సార్సీపీ జాబితాలో ఆర్ధర్ పేరు లేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నందికొట్కూర్ నుంచి కాంగ్రెస్ తరపున ఆర్ధర్ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
What's Your Reaction?