టీడీపీకి భారీ షాక్... వైసీపీలోకి మాజీ మంత్రి...!?

Mar 18, 2024 - 23:14
 0  5234
టీడీపీకి భారీ షాక్... వైసీపీలోకి మాజీ మంత్రి...!?

విశాఖ జిల్లా కంచుకోట తెలుగుదేశానికి పెట్టని కోట అని అంతా భావిస్తూ ఉంటారు.అలాంటి విశాఖ టీడీపీలో చిచ్చు రేగుతోంది. పార్టీ సీనియర్లను పక్కన పెడుతోంది. అది సీనియర్లు అవమానంగా భావిస్తున్నారు. దశాబ్దాలుగా తాము పార్టీకి చేసిన సేవలకు ఇదేనా గౌరవం అని కూడా వాపోతున్నారు..టీడీపీ అధినేత చంద్రబాబు తన వారసుడిని పైకి తీసుకుని రావాలని చూస్తున్నారు. అలాగే మాజీ మంత్రులు కీలక నేతలు ఈ దఫా కనుక టికెట్ ఇస్తే తమ వారసులను రాజకీయంగా ముందుకు తెచ్చుకుంటామని భావిస్తున్నారు. అందుకే వారు ఈసారికి పోటీకి అంత పట్టుబడుతున్నారు. అయితే ఈ విషయంలో పొత్తులు ఎత్తులతో పాటు లోకేష్ కోసం యంగ్ టీం ని తయారు చేయడానికి చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు.

ఆ క్రమంలో చాలా మందికి టికెట్లు గల్లంతు అవుతున్నాయి. అదే కోవలో పెందుర్తికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ లేకుండా చేశారు. ఆ సీటుని జనసేనకు ఇస్తున్నారు. ఈ పరిణామంతో హతాశుడు అయిన బండారు గత కొన్ని రోజులుగా మౌన వ్రతంలో ఉన్నారు. అంతే కాదు ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారు అని అంటున్నారు.

బండారుకి టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడిపోతామని ఆయన అనుచరులు చెబుతూ వస్తున్నారు. ఇపుడు బండారు కూడా వారి మాటలను నిజం చేస్తున్నారు అని అంటున్నారు. బండారు వైసీపీకి టచ్ లోకి వెళ్లారు అని అంటున్నారు. వైసీపీ నేతలు ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటు హామీ ఇచ్చారు అని అంటున్నారు. బండారు కూడా దానికి సరేనని అన్నారని అంటున్నారు.

పెందుర్తి, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ సౌత్ లలో జనసేనకు సీట్లు టీడీపీ కేటాయించింది. ఈ నాలుగు చోట్ల తమ్ముళ్ళు రగిలిపోతున్నారు.పార్టీలో మొదటి నుంచి తాము ఉంటే బలంగా ఉన్న తమ సీట్లలో జనసేనను దించి తమ సోంత సీట్లలో వేరే జెండాను ఎత్తమంటే ఇక తమ రాజకీయ జీవితం మొత్తం పోయినట్లే అని తమ్ముళ్ళు అంటున్నారు. దాంతో వారంతా అధినాయకత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఇపుడు వారిని అందరినీ బండారు ఒక చోటకు చేరుస్తున్నారని ప్రచారం విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. వారి అందరిలో కలసి ఆయన వైసీపీలోకి చేరుతారు అని అంటున్నారు.

 అదే విధంగా బండారు వెంట వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడానికి వైసీపీ అధినాయకత్వం భరోసా ఇస్తోంది అని అంటున్నారు. మొత్తానికి బండారు వంటి బిగ్ షాట్ టీడీపీని వీడితే అది తెలుగుదేశం పార్టీకి విశాఖ జిల్లాలో కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు. అంతే కాదు బలమైన సామాజిక వర్గానికి చెందిన బండారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తీసుకునే ఈ నిర్ణయం ఉత్తరాంధ్రాలో మిగిలిన తమ్ముళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటే వారు కూడా తిరుగుబాటు జెండా ఎగరేస్తే మాత్రం అపుడు సైకిల్ కి కష్టమే అని అంటున్నారు.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow