కేంద్ర నేతలు నన్ను ఆ రెండు విషయాలు అడిగారు
ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తావ అని బీజేపీకేంద్ర నేతలు తనను అడిగారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని వారికి చెప్పానని అన్నారు. ముందు రాష్ట్రం, ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని చెప్పానని తెలిపారు.తన కోసం త్యాగం చేసిన ఉదయ్ను కాకినాడ ఎంపీగా పంపిస్తున్నానని చెప్పారు. పిఠాపురానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంగళవారం నాడు భారీగా జనసేనలో చేరారు. పిఠాపురంలో జనసేన నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అధికార వైసీపీని ఢీకొట్టేలాప్రచారం చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులను అధికార వైసీపీ భయాభ్రాంతులకు గురి చేస్తోందని పవన్ దృష్టికి కీలక నేతలు తీసుకొచ్చారు
What's Your Reaction?